చంద్రునిపై చైనా స్పేస్ క్రాఫ్ట్
- December 30, 2018చైనా ప్రయోగించిన అంతరిక్ష నౌక-' చేంజ్-4 ' చంద్రుడి కక్ష్యలో ప్రవేశించింది. తన అంతరిక్ష కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చైనా జరుపుతున్న ప్రయత్నాల్లో ఇదో ముందడుగని సిన్ హువా వార్తా సంస్థ ప్రకటించింది. అయితే చంద్ర మండలంలో ఎవరికీ ' కనిపించని డార్క్ సైడ్ ' లో ఈ నౌక అడుగుపెట్టనుందని, గతంలో పంపిన స్పేస్ క్రాఫ్ట్ ఇలాంటి ప్రదేశాన్ని తాకలేదని ఈ సంస్థ పేర్కొంది.
అతి పొడవైన ' మార్ట్-3 బీ ' రాకెట్ ని చైనా ఈ నెలారంభంలో ప్రయోగించింది. బీజింగ్ కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున ఈ అంతరిక్ష నౌక..చంద్రుని ఉపరితలానికి సుమారు 15 కి.మీ. దూరంలోని కక్ష్యకు చేరుకుంది. చంద్ర మండలం పైని భూభాగం, అక్కడి వాతావరణ పరిస్థితులు, ఖనిజాలు, న్యూట్రాన్ రేడియేషన్, న్యూట్రాన్ యాటమ్స్ వంటి వాటి విశేషాలను ఈ నౌక అధ్యయనం చేస్తుందని చైనా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 2030 నాటికి అంతరిక్షంపై రష్యా, అమెరికా దేశాలతో సమానంగా తామూ పట్టు సాదించాలన్నదే చైనా లక్ష్యం. వచ్చే ఏడాది తన సొంత మానవ సహిత స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని కూడా ఆ దేశం యోచిస్తోంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!