చంద్రునిపై చైనా స్పేస్ క్రాఫ్ట్
- December 30, 2018
చైనా ప్రయోగించిన అంతరిక్ష నౌక-' చేంజ్-4 ' చంద్రుడి కక్ష్యలో ప్రవేశించింది. తన అంతరిక్ష కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చైనా జరుపుతున్న ప్రయత్నాల్లో ఇదో ముందడుగని సిన్ హువా వార్తా సంస్థ ప్రకటించింది. అయితే చంద్ర మండలంలో ఎవరికీ ' కనిపించని డార్క్ సైడ్ ' లో ఈ నౌక అడుగుపెట్టనుందని, గతంలో పంపిన స్పేస్ క్రాఫ్ట్ ఇలాంటి ప్రదేశాన్ని తాకలేదని ఈ సంస్థ పేర్కొంది.
అతి పొడవైన ' మార్ట్-3 బీ ' రాకెట్ ని చైనా ఈ నెలారంభంలో ప్రయోగించింది. బీజింగ్ కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున ఈ అంతరిక్ష నౌక..చంద్రుని ఉపరితలానికి సుమారు 15 కి.మీ. దూరంలోని కక్ష్యకు చేరుకుంది. చంద్ర మండలం పైని భూభాగం, అక్కడి వాతావరణ పరిస్థితులు, ఖనిజాలు, న్యూట్రాన్ రేడియేషన్, న్యూట్రాన్ యాటమ్స్ వంటి వాటి విశేషాలను ఈ నౌక అధ్యయనం చేస్తుందని చైనా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 2030 నాటికి అంతరిక్షంపై రష్యా, అమెరికా దేశాలతో సమానంగా తామూ పట్టు సాదించాలన్నదే చైనా లక్ష్యం. వచ్చే ఏడాది తన సొంత మానవ సహిత స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని కూడా ఆ దేశం యోచిస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







