చంద్రునిపై చైనా స్పేస్ క్రాఫ్ట్
- December 30, 2018
చైనా ప్రయోగించిన అంతరిక్ష నౌక-' చేంజ్-4 ' చంద్రుడి కక్ష్యలో ప్రవేశించింది. తన అంతరిక్ష కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చైనా జరుపుతున్న ప్రయత్నాల్లో ఇదో ముందడుగని సిన్ హువా వార్తా సంస్థ ప్రకటించింది. అయితే చంద్ర మండలంలో ఎవరికీ ' కనిపించని డార్క్ సైడ్ ' లో ఈ నౌక అడుగుపెట్టనుందని, గతంలో పంపిన స్పేస్ క్రాఫ్ట్ ఇలాంటి ప్రదేశాన్ని తాకలేదని ఈ సంస్థ పేర్కొంది.
అతి పొడవైన ' మార్ట్-3 బీ ' రాకెట్ ని చైనా ఈ నెలారంభంలో ప్రయోగించింది. బీజింగ్ కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున ఈ అంతరిక్ష నౌక..చంద్రుని ఉపరితలానికి సుమారు 15 కి.మీ. దూరంలోని కక్ష్యకు చేరుకుంది. చంద్ర మండలం పైని భూభాగం, అక్కడి వాతావరణ పరిస్థితులు, ఖనిజాలు, న్యూట్రాన్ రేడియేషన్, న్యూట్రాన్ యాటమ్స్ వంటి వాటి విశేషాలను ఈ నౌక అధ్యయనం చేస్తుందని చైనా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 2030 నాటికి అంతరిక్షంపై రష్యా, అమెరికా దేశాలతో సమానంగా తామూ పట్టు సాదించాలన్నదే చైనా లక్ష్యం. వచ్చే ఏడాది తన సొంత మానవ సహిత స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని కూడా ఆ దేశం యోచిస్తోంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!