శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు
- January 02, 2019తిరువనంతపురం: కేరళలో సమానత్వం కోసం మానవ హారం చేపట్టి విజయాన్ని సొంతం చేసుకున్న మహిళలు మరో గెలుపుకు నాంది పలికారు. కేరళలో శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల లోపు ఇద్దరు మహిళలు ప్రవేశించడం ద్వారా వారు చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారు జామున శబరిమలను సందర్శించారు. గత నెలలో వీరిద్దరూ శబరిమల సందర్శించడానికి రాగా, నిరసనల వెలువెత్తడంతో వెనుదిరిగారు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీపరిచాయి. గత అర్థరాత్రి నుండి ఆలయ ప్రవేశానికి సమాయత్తమయ్యారు. తెల్లవారు జామున అయ్యప్ప గర్భగుడిలోకి చేరి పూజలు చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..