క్రూయిజ్ టూరిజం: 100,000 విజిటర్స్
- January 02, 2019
మస్కట్: సుల్తాన్ కబూస్ పోర్ట్ నుంచి గత నాలుగు నెలల్లో సుమారు 100,000 మంది విజిటర్స్ ఒమన్కి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పోర్ట్ ఆపరేటింగ్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం సుల్తాన్ కబూస్ పోర్ట్లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 50కి పైగా షిప్లు డాక్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్లో ప్రారంభమైన 2018-2019 టూరిస్ట్ సీజన్కి సంబంధించి సగం దూరంలో వున్నామనీ, సుల్తాన్ కబూస్ పోర్ట్ సుమారుగా 98,432 మంది టూరిస్టుల్ని తీసుకొచ్చిందని మరాఫి వివరించింది. హరిజాన్, కోస్టా మెడిటేరినియా, ఏజీయన్ ఓడిస్సీ, ఎయిడ్ అప్రిమా, ఎంఎస్సి స్ప్లెండా, ఎంఎస్సి లిరికా, మెయిన్ షిఫ్ 4 తదితర క్రూయిజ్ షిప్లు ఒమన్కి వచ్చాయి. నవంబర్లో మరాఫి రెండు రోజుల టర్న్ ఎరౌండ్ ఆపరేషన్లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో 900 మంది యూకే నుంచి వచ్చిన టూరిస్టులకు స్వాగతం పలికారు. ఈ సీజన్లో మొత్తం 147 షిప్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







