ఏటీఎంలో క్యాష్ నిల్.. ఎస్‌బీఐకి జరిమానా

- January 02, 2019 , by Maagulf
ఏటీఎంలో క్యాష్ నిల్.. ఎస్‌బీఐకి జరిమానా

ముంబై: ఖాతాదారుల అకౌంట్లో మినిమం బాలెన్స్ లేకపోతే ఛార్జీలు వసూలు చేయడం గురించి అందరికీ తెలుసు. అయితే ఏటీఎంలో క్యాష్ లేకపోవడంతో బ్యాంకుకే జరిమానా పడింది. ఏటీఎంలో నగదు లేదని ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో అత్యధిక ఖాతాదారుల గల దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐకి వినియోగదారుల ఫోరం 2,500 రూపాయల జరిమానా విధించింది.
 
రాయపూర్‌కు చెందిన వినియోగదారుడు ఏటిఎంలో నగదు విత్‌డ్రా కోసం వెళ్లినప్పుడు ‘నో క్యాష్ అవైలబుల్’ మెసేజ్ కనిపించింది. ఇలా అతడికి మూడుసార్లు కనిపించడంతో విసిగిపోయిన సదరు వినియోగదారుడు.. వినియోగదారుల ఫోరాన్ని ఆశ్నయించాడు. ఏటీఏంలో నగదు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత సదరు బ్యాంకులకు ఉందని వినియోగదారుల ఫోరం పేర్కొంది.
 
ఏటీఎంలో క్యాష్‌ లభించకపోవడంపై వినియోగదారుల ఫోరం ఎస్‌బీఐని ప్రశ్నించింది. అయితే కేవలం ఇంటర్‌నెట్‌ వైఫల్యమని, దీనికి సర్వీసు ప్రొవైడర్‌ బాధ్యత వహించాలన్న ఎస్‌బీఐ వాదనను తోసి పుచ్చింది. అలాగే మినిమం బ్యాలెన్స్‌ మెయింటైన్‌ చేయని యూజర్ల నుంచి ఏడాదిలో ముందే ఛార్జి వసూలు చేస్తున్నపుడు ఏటీఎంలలో నగదు లేకుండా ఏలా చేస్తారని ప్రశ్నించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com