ఏటీఎంలో క్యాష్ నిల్.. ఎస్బీఐకి జరిమానా
- January 02, 2019
ముంబై: ఖాతాదారుల అకౌంట్లో మినిమం బాలెన్స్ లేకపోతే ఛార్జీలు వసూలు చేయడం గురించి అందరికీ తెలుసు. అయితే ఏటీఎంలో క్యాష్ లేకపోవడంతో బ్యాంకుకే జరిమానా పడింది. ఏటీఎంలో నగదు లేదని ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో అత్యధిక ఖాతాదారుల గల దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐకి వినియోగదారుల ఫోరం 2,500 రూపాయల జరిమానా విధించింది.
రాయపూర్కు చెందిన వినియోగదారుడు ఏటిఎంలో నగదు విత్డ్రా కోసం వెళ్లినప్పుడు ‘నో క్యాష్ అవైలబుల్’ మెసేజ్ కనిపించింది. ఇలా అతడికి మూడుసార్లు కనిపించడంతో విసిగిపోయిన సదరు వినియోగదారుడు.. వినియోగదారుల ఫోరాన్ని ఆశ్నయించాడు. ఏటీఏంలో నగదు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత సదరు బ్యాంకులకు ఉందని వినియోగదారుల ఫోరం పేర్కొంది.
ఏటీఎంలో క్యాష్ లభించకపోవడంపై వినియోగదారుల ఫోరం ఎస్బీఐని ప్రశ్నించింది. అయితే కేవలం ఇంటర్నెట్ వైఫల్యమని, దీనికి సర్వీసు ప్రొవైడర్ బాధ్యత వహించాలన్న ఎస్బీఐ వాదనను తోసి పుచ్చింది. అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని యూజర్ల నుంచి ఏడాదిలో ముందే ఛార్జి వసూలు చేస్తున్నపుడు ఏటీఎంలలో నగదు లేకుండా ఏలా చేస్తారని ప్రశ్నించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







