విమానంలో ఒకే ప్రయాణికురాలిగా లూసియా ఎరిస్పే
- January 03, 2019
ఫిలిప్పీన్స్: ఓ విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తే... బాగా డబ్బుండి చార్టెడ్ విమానాన్ని అద్దెకు తీసుకుని వెళ్లగలిగిన వారైతే ఇది సాధ్యమే. కానీ, మామూలు ప్యాసింజర్ విమానంలో ఇది జరగాలంటే... అసలు ఊహకే అందదుకదా? ఫిలిప్పీన్స్ కు చెందిన లూసియా ఎరిస్పే ఈ కలను సాకారం చేసుకుంది. అసలు విషయాన్ని, తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. లూసియా ఎరిస్పే, దావో నుంచి మనిలా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంది. ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్ పీఆర్ 2820 అనే విమానం కోసం ఎదురుచూసి, విమానం రాగానే, లోపలికి ఎక్కింది. చుట్టూ ఎవరూ లేరు. ప్రయాణం చేస్తున్నది తాను ఒక్కర్తినేనని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. విమానం సిబ్బందితో సెల్ఫీలు దిగింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా, గతంలో కరోన్ గ్రీవ్ అనే మహిళ కూడా ఇలానే విమానంలో ఒంటరిగా ప్రయాణించిన అనుభూతిని మిగుల్చుకుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







