ఖష్తోగీ హత్య: దోషులకు మరణ శిక్ష పడాల్సిందే

- January 03, 2019 , by Maagulf
ఖష్తోగీ హత్య: దోషులకు మరణ శిక్ష పడాల్సిందే

దుబాయ్‌: సౌదీ అరేబియా ప్రాసిక్యూటర్స్‌, జర్నలిస్ట్‌ జమాల్‌ ఖష్తోగీ హత్య కేసులో ఐదుగురు దోషులకు మరణ శిక్ష పడాల్సిందేనని అంటున్నారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు న్యాయస్థానం యెదుట హాజరయ్యారు. సౌదీ జనరల్‌ ప్రాసిక్యూషన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుల ఇంటరాగేషన్‌ కొనసాగుతోందని పేర్కొంది. ఫర్దర్‌ ఎవిడెన్స్‌ కోసం టర్కీకి విజ్ఞప్తులు వెళ్ళాయనీ తెలిపింది. అయితే ఇప్పటిదాకా అటువైపు నుంచి సమాచారం అందలేదని ప్రాసిక్యూటర్స్‌ పేర్కొనన్నారు. జమాల్‌ ఖష్తోగీ, అక్టోబర్‌ 2న టర్కీలోని సౌదీ కాన్సులేట్‌కి వెళ్ళిన అనంతరం అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు వెల్లడయ్యింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com