చిలీలో కార్చిచ్చు...8 మంది మృతి
- January 06, 2019శాంటియాగో : దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తున్నది. మంటల్లో చిక్కుకొని 8 మంది మృతిచెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. వందలాది ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కార్చిచ్చు చెలరేగిన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వోల్పారైసో ప్రాంతంలో భారీ ఆస్తినష్టం సంభవించిందన్నారు. లిమాచే నగర మేయర్ కార్చిచ్చు వ్యాపించిన ప్రాంతాల్లో పర్యటించారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఓ హిగ్గిన్స్ దక్షిణ ప్రాంతంలోని 2600 హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైందని అన్నారు. అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు