నార్త్ కువైట్లో భూ ప్రకంపనలు
- January 07, 2019కువైట్ సిటీ: ఇరాన్ - ఇరాక్ బోర్డర్లో 5.9 మాగ్నిట్యూడ్ తీవ్రతతో సంభవించిన భూకంపం తాలూకు ప్రకంపనల ప్రభావం కువైట్ నార్త్ ప్రాంతంలోనూ కన్పించినట్లు కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ - నేషనల్ సెస్మలాజికల్ నెట్వర్క్ పేర్కొంది. డాక్టర్ అబ్దుల్లా అల్ ఎనెజి మాట్లాడుతూ, కువైట్లో సాయంత్రం 5.15 నిమిషాలకు ఈ ప్రకంపనల ప్రభావం కన్పించిందని అన్నారు. ఈ ప్రకంపనల కారణంగా ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇరాన్ పశ్చిమ కెర్మాన్షా ్పఆవిన్స్లోని ఘలింఘార్బ్ ప్రాతంలో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు టెహ్రాన్ యూనివర్సిటీ సెంటర్ పేర్కొంది. కాగా, 2017 నవంబర్లో సంభవించిన భూకంపం ఇరాన్లో 211 మంది ప్రాణాల్ని బలి తీసుకుంది.
తాజా వార్తలు
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ