KGF దర్శకుడితో ప్రభాస్
- January 10, 2019ప్రభాస్లో భారీ సినిమాలు తీసేందుకు అనేక నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. సాహో. ఈ ఏడాదిలో రానుంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లుగా తేల్చారు. మరో పిరియాడికల్ లవ్ స్టోరీ సినిమాలో కూడా నటిస్తున్నారు. దీనికి రాధాకృష్ణ దర్శకుడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివర్లో పూర్తవుతాయి. ఆ తర్వాత ఆయన కమిట్మెంట్ ఏమిటనేది స్పష్టం కాలేదు.
బాహుబలి ప్రేరణలో కన్నడలో తీసిన కేజీఎఫ్ మంచి విజయం పొందింది. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్కు మంచి పేరు వచ్చింది. పరిమిత వ్యయంతో సినిమాలు తీసే కన్నడ భాషలో ఇంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రం తీసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. అందుకే ప్రశాంత్తో సినిమా చేసేందుకు పలువురు స్టార్స్ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. తాజాగా ప్రశాంత్, ప్రభాస్ కలయికలో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందట. గతంలో దిల్ రాజు సంస్థలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలో ప్రభాస్ నటించారు. మళ్లి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం