తమిళనాడులో ఫ్యాన్స్ వార్
- January 10, 2019తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఏకంగా ఒకరిపై ఒకరు కత్తులతో పొడుచుకునే స్థాయి వరకు వెళ్లింది అభిమానుల గొడవ. ఇవాళ పొంగల్ కానుకగా రజనీకాంత్ నటించిన పేట సినిమా.. అజిత్ నటించిన విశ్వాసం సినిమా విడుదలయ్యాయి. దీంతో తమిళనాడులో ఇద్దరు హీరోల అభిమానుల గొడవ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. పలు చోట్ల ఫ్యాన్స్ ఘర్షణలకు దిగటంతో పరిస్థితి చేయిదాటిపోయింది.
వేలూరులోని రోహిణి థియేటర్ ముందు ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో నలుగురు పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అభిమానుల మాత్రం తమ హీరో గ్రేట్ అంటే తమ హీరో గ్రేట్ అంటూ దాడులకు తెగబడ్డారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం