అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ఖతార్ రెడీ
- January 14, 2019
దోహ : అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఖతార్ సన్నద్ధమ వుతోంది. ప్రస్తుతమున్న 30బిలియన్ డాలర్ల ( రూ.21,11,40,00,00,000) పెట్టుబడిని రానున్న రెండేండ్లలో 45బిలియన్ డాలర్లకు ( రూ.31,67,10,00,00,000) చేర్చాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్టు ఖతార్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ సీఈవో మన్సూర్ బిన్ ఇబ్రహీమ్ తెలిపారు. ఖతార్ పర్యటలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియోతో భేటీ ఆయన తర్వాత ఇబ్రహీమ్ స్థానిక మీడియాతో మాట్లాడారు. అమెరికాలో ఈయూతో సమానంగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మొహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థనీ రాజకీయ, రక్షణ సంబంధిత వ్యవహారాలపై పోంపియోతో సుదీర్ఘంగా చర్చించారని వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ఆయన ఉద్ఘాటించారు. గతనెలలో అమెరికాలో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, ప్రస్తుతం ఖతార్లో చర్చలు నిర్వహించామని అన్నారు. అమెరికాతో విద్య, రక్షణ,సాంకేతిక పరిజ్ఞానం, శక్తివనరులు, పరస్పర సహకారం, ఆరోగ్యం తదితర అంశాలకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







