అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ఖతార్ రెడీ
- January 14, 2019దోహ : అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఖతార్ సన్నద్ధమ వుతోంది. ప్రస్తుతమున్న 30బిలియన్ డాలర్ల ( రూ.21,11,40,00,00,000) పెట్టుబడిని రానున్న రెండేండ్లలో 45బిలియన్ డాలర్లకు ( రూ.31,67,10,00,00,000) చేర్చాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్టు ఖతార్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ సీఈవో మన్సూర్ బిన్ ఇబ్రహీమ్ తెలిపారు. ఖతార్ పర్యటలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియోతో భేటీ ఆయన తర్వాత ఇబ్రహీమ్ స్థానిక మీడియాతో మాట్లాడారు. అమెరికాలో ఈయూతో సమానంగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మొహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థనీ రాజకీయ, రక్షణ సంబంధిత వ్యవహారాలపై పోంపియోతో సుదీర్ఘంగా చర్చించారని వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ఆయన ఉద్ఘాటించారు. గతనెలలో అమెరికాలో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, ప్రస్తుతం ఖతార్లో చర్చలు నిర్వహించామని అన్నారు. అమెరికాతో విద్య, రక్షణ,సాంకేతిక పరిజ్ఞానం, శక్తివనరులు, పరస్పర సహకారం, ఆరోగ్యం తదితర అంశాలకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు