దుబాయ్ పార్క్లో మహిళపై అత్యాచారం
- January 14, 2019
ఆసియాకి చెందిన ఓ మహిళపై అత్యాచారం జరిగింది. దుబాయ్ పార్క్లో, స్టాఫ్ మెంబర్గా నటించిన ఓ వ్యక్తి, బాధిత మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకోగానే రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని బంగ్లాదేశీ వ్యక్తిగా గుర్తించారు. బాధితురాలి వయసు 21 ఏళ్ళు కాగా, నిందితుడి వయసు 40 ఏళ్ళు. పార్క్లో ఫ్రెండ్తో కలిసి కూర్చుని వున్న తనను ఐడీ చూపించాల్సిందిగా ఓ వ్యక్తి తనను కోరారనీ, ఆ తర్వాత 500 దిర్హామ్ల జరీమానా విధిస్తున్నట్లు చెప్పారనీ, డబ్బులు తీసుకురావడానికి ఫ్రెండ్ బయటు వెళ్ళగా, నిందితుడు తనపై అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ చెప్పింది. ఘటన తర్వాత, నిందితురాలు తన ఫ్రెండ్ వద్దకు వెళ్ళి, ఆ ఫ్రెండ్ సాయంతో పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది. ఫోరెన్సిక్ పరీక్షలో, మహిళ శరీరం నుంచి సేకరించిన శాంపిల్స్, నిందితుడి డీఎన్ఏతో మ్యాచ్ అయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







