మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం

- January 14, 2019 , by Maagulf
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం

శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి ట్రావన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టీడీబీ అధ్యక్షుడు పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జ్యోతి దర్శనం సందర్భంగా పంపానది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయని తెలిపారు. స్వామివారి తిరువాభరణాలను సోమవారం సాయంత్రం 6గంటలకు పద్దెనిమిది మెట్ల మీదుగా సన్నిధానం చేరుస్తామని అన్నారు. 6.30 గంటలకు దీపారాధన చేసి, స్వామికి దివ్యాభరణాలు ధరింపచేసే తిరువాభరణ ఘట్టం పూర్తి చేస్తామని తెలిపారు. అదే సమయంలో పొన్నంబలమేడు నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారని పేర్కొన్నారు. భక్తులు ఈనెల 19 వరకు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చని, 20న పందళ రాజవంశీకులు స్వామివారిని దర్శించుకున్న తరువాత ఆలయాన్ని మూసివేస్తామని టీడీబీ అధ్యక్షుడు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com