మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం
- January 14, 2019
శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి ట్రావన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టీడీబీ అధ్యక్షుడు పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జ్యోతి దర్శనం సందర్భంగా పంపానది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయని తెలిపారు. స్వామివారి తిరువాభరణాలను సోమవారం సాయంత్రం 6గంటలకు పద్దెనిమిది మెట్ల మీదుగా సన్నిధానం చేరుస్తామని అన్నారు. 6.30 గంటలకు దీపారాధన చేసి, స్వామికి దివ్యాభరణాలు ధరింపచేసే తిరువాభరణ ఘట్టం పూర్తి చేస్తామని తెలిపారు. అదే సమయంలో పొన్నంబలమేడు నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారని పేర్కొన్నారు. భక్తులు ఈనెల 19 వరకు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చని, 20న పందళ రాజవంశీకులు స్వామివారిని దర్శించుకున్న తరువాత ఆలయాన్ని మూసివేస్తామని టీడీబీ అధ్యక్షుడు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







