కువైట్లో 1 మిలియన్ భారతీయులు
- January 14, 2019కువైట్ సిటీ: కువైట్ అభివృద్ధిలో భారతీయుల పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో వుందని కువైట్లో భారత అంబాసిడర్ జీవ సాగర్ అభిప్రాయపడ్డారు. 'వలసదారుల దినోత్సవం' నేపథ్యంలో జీవ సాగర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కువైట్లోని డిప్లమాటిక్ కార్ప్స్కి సంబంధించిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యునైటెడ్ కింగ్డమ్, సౌత్ ఆఫ్రికాకి చెందిన రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సౌతాఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్లో కూడా భారతీయులు ఎక్కువగా వున్నారనీ, మహాత్మా గాంధీ ఆయా దేశాల్లో కొంత కాలం నివసించారని ఈ సందర్భంగా జీవ కుమార్ చెప్పారు. ఏ దేశంలో వున్నా భారతీయులు ఆ దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని అలవరచుకోవడంతోపాటు, తమ దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని కొనసాగిస్తుంటారని జీవకుమార్ చెప్పారు. కువైట్ ప్రభుత్వం, భారత వలసదారులకు అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారాయన.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు