కువైట్లో 1 మిలియన్ భారతీయులు
- January 14, 2019
కువైట్ సిటీ: కువైట్ అభివృద్ధిలో భారతీయుల పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో వుందని కువైట్లో భారత అంబాసిడర్ జీవ సాగర్ అభిప్రాయపడ్డారు. 'వలసదారుల దినోత్సవం' నేపథ్యంలో జీవ సాగర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కువైట్లోని డిప్లమాటిక్ కార్ప్స్కి సంబంధించిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యునైటెడ్ కింగ్డమ్, సౌత్ ఆఫ్రికాకి చెందిన రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సౌతాఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్లో కూడా భారతీయులు ఎక్కువగా వున్నారనీ, మహాత్మా గాంధీ ఆయా దేశాల్లో కొంత కాలం నివసించారని ఈ సందర్భంగా జీవ కుమార్ చెప్పారు. ఏ దేశంలో వున్నా భారతీయులు ఆ దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని అలవరచుకోవడంతోపాటు, తమ దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని కొనసాగిస్తుంటారని జీవకుమార్ చెప్పారు. కువైట్ ప్రభుత్వం, భారత వలసదారులకు అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారాయన.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







