శబరిమలలో మకరజ్యోతి దర్శనం
- January 14, 2019కేరళ:శబరిమల వాసుడు అయ్యప్పదేవుడి సన్నిధిలో కీలక ఘట్టం షురూ అయింది. ఇవాళ జ్యోతి దర్శనం కోసం శబరిమల కొండల్లో అయ్యప్ప భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మరికాసేపట్లో ఆవిష్కృతం కానున్న జ్యోతి దర్శనం కోసం భక్తకోటి తపిస్తోంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు దక్షిణాది రాష్ట్రాలనుంచి భారీగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు, సామాన్య భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. (జనవరి14వ తేదీ సొమవారం) సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు జరిగే మకరజ్యోతి దర్శనం కోసం పంపానది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు చేశారు. పొన్నాంబలమేడు కొండపై జ్యోతి దర్శనమివ్వనుంది. కాగా, రెండు రోజుల క్రితమే పంధాలం నుండి వచ్చిన అయ్యప్ప స్వామి తిరువాభరణాలను సాయంత్రం 6గంటలకు 18 మెట్ల మీదుగా సన్నిధానానికి చేరుస్తారు. అనంతరం తిరువాభరణం ఘట్టం జరుగుతుంది. తిరువాభరణం ఘట్టాన్ని, జ్యోతి దర్శనాన్ని చూసేందుకు నలుమూలలనుంచి సుమారు 18 మంది లక్షల మంది శబరిమలవాసుని సన్నిధికి చేరుకున్నారని సమాచారం.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం