టూరిస్టులపై ఉగ్రదాడి...15 మంది మృతి
- January 16, 2019
మరోసారి ఉగ్రదాడి ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేసింది. కేవలం టూరిస్టులే లక్ష్యంగా జరిగిన ఈ దాడితో ఉగ్రమూకల లక్ష్యం తెలుస్తుంది. తాజాగా జరిగిన ఘటనలో, కెన్యా రాజధాని నైరోబిలో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. విదేశీయులే లక్ష్యంగా ఓ హోటల్పై దాడులకు తెగబడ్డారు. నైరోబిలోని వెస్ట్ల్యాండ్స్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో 'డస్టిట్ డీ2' హోటల్ వద్ద జరిగిన ఈ ఘటనలో 10 నుంచి 15 మంది వరకు చనిపోయారని ప్రాథమికంగా నిర్థారించారు. వివరాల్లోకి వెళితే.విదేశీయులు అధికంగా ఉండే హోటల్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రమూకలు తొలుత హోటల్ ప్రాంగణంలో పార్కింగ్ చేసి ఉన్న వాహనాలపైకి బాంబులు విసిరి భయోత్పాతం సృష్టించారు. అనంతరం ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు. దాడి అనంతరం ముష్కరులు తుపాకులతో కాల్పులకు దిగారు.
ఈ ఘటనలో ఐదుగురు ఘటనా స్థలిలోనే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఓ అమెరికన్ కూడా ఉన్నారని భావిస్తున్నారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాకున్నా 10 నుంచి 15 వరకు ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి సమాచారం అందగానే హుటాహుటిన చేరుకున్న భద్రతా బలగాలు హోటల్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఘటనను ఆ దేశ మంత్రి ఫ్రెడ్మాషియాంగ్ ఖండించారు. ఉగ్రమూకలు ఇటువంటి చర్యలతో మమ్మల్ని ఓడించలేరని ప్రకటించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని 'ఆల్ షహాబ్' ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







