బ్రెగ్జిట్లో ఓడారు.. విశ్వాసంలో నెగ్గారు..
- January 17, 2019బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు ఆ దేశ ప్రధాని థెరిసా మె పై విశ్వాసం ఉంచారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదలగాలన్న నిర్ణయం (బ్రెగ్జిట్)పై జరిగిన ఓటింగ్లో ఆమె ఓడిపోయారు. కానీ, ఆమెపై పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస పరీక్షలో మాత్రం విజయం సాధించారు. అంటే తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో థెరిసా మె గెలుపొందారు. దీంతో థెరిసా బ్రిటన్ ప్రధానిగా కొనసాగనున్నారు.
325 మంది ఎంపీలున్న బ్రిటన్ పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి థెరెసా మె పై లేబర్ పార్టీ అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 306 మంది ఎంపీలు థెరిసాకు అనుకూలంగా ఓటు వేశారు.
ఫలితంగా లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అనంతరం బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలకు రావాల్సిందిగా ప్రతిపక్ష నేతలను బ్రిటన్ ప్రధాని థెరెసా ఆహ్వానించారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై వీలైనంత త్వరగా నిర్ణయానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం