థాయి ఆలయంలో కాల్పులు..ఇద్దరు బౌద్ధ సన్యాసులు మృతి
- January 20, 2019
థాయిలాండ్: దక్షిణ నారాతైవాత్ ప్రావిన్స్లోని ఒక ఆలయంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఇద్దరు బౌద్ధ సన్యాసులను కాల్చిచంపారు. మరో ఇద్దరిని గాయపరిచారు.. ఈ ప్రావిన్స్లో ప్రధానంగా మలరు, ముస్లిం జనాభా ఎక్కువ. ఆరుగురు దుండగులు కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామని, వారందరూ పరారీలో వున్నారని పోలీసు ప్రతినిధి తెలిపారు. గాయపడిన వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స చేసి పంపించేశారు. దక్షిణ థాయిలాండ్లో 15ఏళ్ళ నుండి వేర్పాటువాద తీవ్రవాదం ప్రబలి వుంది. అక్కడ జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 6900 మంది మరణించగా, 13వేల మందికి పైగా గాయపడ్డారని స్వతంత్ర పర్యవేక్షక గ్రూపు దీప్ సౌత్ వాచ్ తెలిపింది. ఇక్కడ దాడుల్లో తరచుగా బౌద్ధులను, ముస్లిములను, మత నేతలను లక్ష్యంగా చేసుకుంటూ వుంటారు. కాగా ఈ దాడులకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







