నలుగురు అమ్మాయిల కథ
- January 22, 2019
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ బ్యానర్పై కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. హిమ బిందు వెలగపూడి నిర్మాణంలో బాలు దర్శకత్వంలో తెరకెక్కనుంది. దర్శకుడు బాలు మాట్లాడుతూ 'మహానగరంలో నివసిస్తూ స్వతంత్య్ర భావాలున్న నలుగురు అమ్మాయిలకు సంబంధించిన కథే ఈ చిత్రం. త్రిదా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధి ఇద్నాని, కొమలి ప్రసాద్ నలుగురు అమ్మాయిలుగా నటిస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కథానుగుణంగా ఉండే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుం టాయి' అని అన్నారు.
నిర్మాత హిమబిందు వెలగపూడి మాట్లాడుతూ 'హైదరాబాద్లో నేటి నుండి తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. ఫిబ్రవరిలో గోవాలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి మే నెలలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : రఘుకుంచె, సినిమాటోగ్రఫీ : శేఖర్ గంగమోని, పాటలు : భాస్కర భట్ల, లక్ష్మీ భూపాల్, ఎడిటింగ్ : నాగేశ్వర్ రెడ్డి, పి.ఆర్.ఒ: ఫణి - నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్కీ రొలర్ కొస్టర్, లైన్ ప్రొడ్యూసర్ : సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాతలు: రాధికా శ్రీనివాస్ వెత్షా, ఉమా కూచిపూడి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







