కేరళ వరుద బాధితుల చెక్కులు బౌన్స్‌

- January 22, 2019 , by Maagulf
కేరళ వరుద బాధితుల చెక్కులు బౌన్స్‌

తిరువనంతపురం: 2018లో భారీ వర్షాలు, వరదలు, కారణాంగా కేరళ రాష్ట్రాం అతలాకుతం చేసిన విషయం తెలిసిందే. అయితే వరద బాధితులకు ఇచ్చిన పలు చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. అక్కడి దీన పరిస్థితి చూసి పలువురు దేశ విదేశాల నుండి సహాయం చేశారు. విరాళాల రూపంలో సిఎం సహాయ నిధికి రూ.3.26కోట్ల విలువైన చెక్కులను డీడీలను బ్యాంకులు తిరస్కరించాయి. అసెంబ్లీ సమావేశాల్లో చర్చ సందర్భంగా కసర్గోడ్ ఎమ్మెల్యే ఎన్ నీలిక్కున్ను ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సీఎం సహాయ నిధికి 30 నవంబర్,2018 వరకు మొత్తం రూ. 2,797.67 కోట్ల సహాయం అందిందన్నారు. దీంట్లో రూ. 260.45 కోట్లు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా రాగా రూ. 2,537.22 కోట్లు చెక్కులు, నగదు, డీడీల రూపంలో వచ్చిందన్నారు. ఒక్క చెక్కుల ద్వారానే రూ. 7.46 కోట్లు వచ్చినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com