ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ప్రియాంక గాంధీకి..

- January 23, 2019 , by Maagulf
ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ప్రియాంక గాంధీకి..

సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంతానికి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ హవాను తగ్గించడానికి. కాంగ్రెస్ కు ఆదరణ పెంచడానికి వీలుగా అధిష్టానం వ్యూహం రచించింది. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇన్నాళ్లూ తల్లి, సోదరుడు పోటీ చేసే స్థానాల్లోనే ప్రియాంక ప్రచారం చేస్తూ వచ్చారు. యూపీలో మెజార్టీ సీట్ల సాధనకు కాంగ్రెస్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రియాంకను తెరపైకి తెచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com