నిలిచిపోయిన 8 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు.. అలా చేస్తే వారికి ఉపసమనం!

- January 25, 2019 , by Maagulf
నిలిచిపోయిన 8 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు.. అలా చేస్తే వారికి ఉపసమనం!

అమెరికాలో నెలరోజులుగా కొనసాగుతున్న షట్ డౌన్ కు ముగింపు పలికేందుకు రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. తాత్కాలిక బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు సమాయాత్తమవుతున్నారు. ప్రతినిధుల సభలో ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించక పోవడంతో దేశంలో షట్ డౌన్ కొనసాగుతోంది.

అమెరికా మెక్సికో సరిహద్దు గోడనిర్మాణ నిధులకు ప్రెసిడెంట్ ట్రంప్ పట్టుబడుతుండగా… డెమోక్రటిక్ ప్రతినిధులు అందుకు నిరాకరిస్తుండటంతో పరిస్థితి షట్ డౌన్ కు దారితీసింది. దీంతో దేశంలో 8లక్షలమంది ఉద్యోగులకు వేతనాలు నిలిచిపోవడంతో దుర్బర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

అయితే ఈ పరిస్థితిని అదిగమించేందుకు సెనెటర్లు తాత్కాలిక ఫండ్ బిల్లును కాంగ్రెస్ లో ప్రవేశపెట్టేందు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల దేశంలో లక్షలాదిమందికి కొంత ఉపసమనం లభిస్తుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com