బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. ఒకరి మృతి

- January 26, 2019 , by Maagulf
బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. ఒకరి మృతి

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్‌లో కబీర్ సింగ్ పేరుతో తెరకక్కుతోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

షూటింగ్ జరిగే ప్రాంతంలో అమర్చిన జనరేటర్ పనిచేయకపోవడంతో టెక్నీషియన్ రాము వచ్చి రిపేర్ చేస్తున్నాడు. అంతలోనే జనరేటర్ రెక్కలలో చిక్కుకు పోయి కింద పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. యూనిట్ సభ్యులు వెంటనే అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాము మృతి చెందాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com