ఇటాలియన్ క్రూజ్ షిప్లో షేక్ మొహమ్మద్
- January 28, 2019దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్లోని పోర్ట్ ఆఫ్ రషీద్లో ఇటలియన్ క్రూజ్ షిప్ ఎంఎస్సి స్ప్లెండిడాను సందర్శించారు. క్రూజ్ షిప్లో ఆయన కలియతిరిగారు. ఈ భారీ షిప్లో వున్న సౌకర్యాల్ని ఆయన తెలుసుకున్నారు. షిప్లో మొత్తం 1,300 మంది సిబ్బంది రోజులో 24 గంటలూ పనిచేస్తారు, షిప్లో వున్న అతిథులకు సహాయ సహకారాలు అందిస్తారు, వారి సేవలో తరిస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాల పర్యాటకులకు యూఏఈ స్వర్గధామం లాంటిదని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ చెప్పారు. టూరిజం రంగంలో అభివృద్ధి దేశానికి ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. షేక్ మొహమ్మద్ వెంట దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, ఎమిరేట్స్ గ్రూప్ ఛైర్మన్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి, డైర్టెర్ జనరల్ ఆఫ్ ది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ - దుబాయ్ ఖలీఫా సయీద్ సులేమాన్ తదితరులు షిప్ని సందర్శించినవారిలో వున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?