సైబర్ సెక్యూరిటీ: 25 మంది సౌదీ చిన్నారులకు శిక్షణ
- February 01, 2019జెడ్డా: సౌదీ ఫెడరేషన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, ప్రోగ్రామింగ్ అండ్ డ్రోన్స్ (ఎస్ఎఎఫ్సిఎస్పి), 'ప్రోగ్రామింగ్ ఫర్ యంగ్ సౌదీస్' పేరుతో ఈవెంట్ నిర్వహించింది. రియాద్లోని హెడ్ క్వార్టర్స్లో ఒరాకిల్ సంస్థతో కలిసి శిక్షనా శిబిరాన్ని ఏర్పాటు చేయగా, ఇందులో 25 మంది సౌదీ చిన్నారులు పాల్గొన్నారు. 8 నుంచి 14 ఏళ్ళ వయసు గల ఈ చిన్నారులకు జవా మరియు పైథాన్ వంటి లాంగ్వేజెస్ ద్వారా సైబర్ సెక్యూరిటీపై ట్రైనింగ్ ఇచ్చారు. స్క్రాచ్, అలీస్, గ్రీన్ ఫుట్ వంటి ప్లాట్ఫామ్స్ గురించి తెలియజేశారు. చిన్నారుల్లో సైబర్ సెక్యూరిటీ పట్ల అవగాహన కల్పించడమే ఈ ట్రైనింగ్ ఉద్దేశ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ ప్రోగ్రామ్ని ఉదయం 8 గంట లనుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించారు. పాల్గొన్న ప్రతి చిన్నారికీ సర్టిఫికెట్ని అందజేశారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు