ఎమిరేట్స్ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- February 02, 2019
దుబాయ్ నుంచి జకార్తా వెళుతున్న ఎమిరేట్స్ విమానం అత్యవసరంగా కొచ్చిన్లో ల్యాండ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండ్ చేసి, బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడ్ని ఇండోనేసియాకి చెందిన 59 ఏళ్ళ వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చ్యురీలో వుంచారు. సంబంధీకులకు సమాచారం పంపించారు. ఫార్మాలిటీస్ అనంతరం, మృతదేహాన్ని స్వదేశానికి తరలిస్తారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







