వీడిన జయరాం హత్య మిస్టరీ.. అతనే హంతకుడు
- February 03, 2019చిగురుపాటి జయరాం హత్య కేసులో మిస్టరీ వీడింది. శ్రీఖా చౌదరి స్నేహితుడు రాకేష్ హత్య చేయించినట్లు తేల్చారు పోలీసులు. కిరాయి హంతకులతో మర్డర్ చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. శ్రీఖా చౌదరి తర్వాత రాకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..నిన్నటి నుంచి అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు కేసులో మిస్టరీని చేధించారు.
శ్రీఖా చౌదరి, రాకేష్ కు నాలుగున్నర కోట్ల రూపాయలు బకాయి పడింది. ఈ బకాయి సొమ్ముకు జయరాం మధ్యవర్తిగా ఉన్నాడు. కొద్దికాలంగా అప్పు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాకేష్ కిరాయి హంతకులతో జయరాంను హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. అయితే రాకేష్ కు ఎవరు సహకరించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
జయరాంను ఎక్కడ హత్య చేశారనేది ఇంకా తెలాల్సి ఉంది. పోస్ట్ మార్టమ్ జరిగే సమయానికి సరిగ్గా 24 గంటల ముందు జయరాం చనిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో 30వ తేదినే హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే..మర్డర్ ఎక్కడ జరిగిందనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. శ్రీఖా ఇంట్లోనే హత్య జరిగిందని ముందుగా భావించినా..జయరాం 29న ఆమె ఇంటికి వెళ్లి…ఆ రోజు సాయంత్రమే తిరిగి వెళ్లిపోయినట్లు సెక్యూరిటీ రికార్డులో ఉంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ