వీడిన జయరాం హత్య మిస్టరీ.. అతనే హంతకుడు
- February 03, 2019చిగురుపాటి జయరాం హత్య కేసులో మిస్టరీ వీడింది. శ్రీఖా చౌదరి స్నేహితుడు రాకేష్ హత్య చేయించినట్లు తేల్చారు పోలీసులు. కిరాయి హంతకులతో మర్డర్ చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. శ్రీఖా చౌదరి తర్వాత రాకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..నిన్నటి నుంచి అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు కేసులో మిస్టరీని చేధించారు.
శ్రీఖా చౌదరి, రాకేష్ కు నాలుగున్నర కోట్ల రూపాయలు బకాయి పడింది. ఈ బకాయి సొమ్ముకు జయరాం మధ్యవర్తిగా ఉన్నాడు. కొద్దికాలంగా అప్పు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాకేష్ కిరాయి హంతకులతో జయరాంను హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. అయితే రాకేష్ కు ఎవరు సహకరించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
జయరాంను ఎక్కడ హత్య చేశారనేది ఇంకా తెలాల్సి ఉంది. పోస్ట్ మార్టమ్ జరిగే సమయానికి సరిగ్గా 24 గంటల ముందు జయరాం చనిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో 30వ తేదినే హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే..మర్డర్ ఎక్కడ జరిగిందనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. శ్రీఖా ఇంట్లోనే హత్య జరిగిందని ముందుగా భావించినా..జయరాం 29న ఆమె ఇంటికి వెళ్లి…ఆ రోజు సాయంత్రమే తిరిగి వెళ్లిపోయినట్లు సెక్యూరిటీ రికార్డులో ఉంది.
తాజా వార్తలు
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!