వీడిన జయరాం హత్య మిస్టరీ.. అతనే హంతకుడు
- February 03, 2019
చిగురుపాటి జయరాం హత్య కేసులో మిస్టరీ వీడింది. శ్రీఖా చౌదరి స్నేహితుడు రాకేష్ హత్య చేయించినట్లు తేల్చారు పోలీసులు. కిరాయి హంతకులతో మర్డర్ చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. శ్రీఖా చౌదరి తర్వాత రాకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..నిన్నటి నుంచి అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు కేసులో మిస్టరీని చేధించారు.
శ్రీఖా చౌదరి, రాకేష్ కు నాలుగున్నర కోట్ల రూపాయలు బకాయి పడింది. ఈ బకాయి సొమ్ముకు జయరాం మధ్యవర్తిగా ఉన్నాడు. కొద్దికాలంగా అప్పు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాకేష్ కిరాయి హంతకులతో జయరాంను హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. అయితే రాకేష్ కు ఎవరు సహకరించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
జయరాంను ఎక్కడ హత్య చేశారనేది ఇంకా తెలాల్సి ఉంది. పోస్ట్ మార్టమ్ జరిగే సమయానికి సరిగ్గా 24 గంటల ముందు జయరాం చనిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో 30వ తేదినే హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే..మర్డర్ ఎక్కడ జరిగిందనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. శ్రీఖా ఇంట్లోనే హత్య జరిగిందని ముందుగా భావించినా..జయరాం 29న ఆమె ఇంటికి వెళ్లి…ఆ రోజు సాయంత్రమే తిరిగి వెళ్లిపోయినట్లు సెక్యూరిటీ రికార్డులో ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







