ఇక ధనాధన్ ‘టి20’ పోరు
- February 04, 2019
న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్ లో 4-1తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా ఇక టి20 సిరీస్ విజయంపై కన్నేసింది. టెస్టులు, వన్డేలలో అగ్రశ్రేణి జట్టుగా నిరూపించుకుంటున్న భారత క్రికెట్ జట్టు ట్వంటీ 20 మ్యాచ్ ర్యాంకింగ్ లలో పాకిస్థాన్ కంటే 8 పాయింట్లు వెనుక బడింది. ఆస్ట్రేలియాలో టెస్టులు, వన్డేలలోనూ, న్యూజిలాండ్ లో వన్డే సిరీస్ లోనూ సత్తా చాటి, సంపూర్ణ ఆధిపత్యం వహించిన టీమిండియా టి20 రికార్డులను మెరుగు పరచుకోవడంపై దృష్టి సారించాలని, పాకిస్థాన్ ను అగ్రస్థానం నుంచి తప్పించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన వెల్లింగ్టన్ లో, రెండో టి20 మ్యాచ్ 8వ తేదీన ఆక్లాండ్ లో, మూడో మ్యాచ్ 10వ తేదీన హామిల్టన్ లో జరగనున్నాయి. ఈ మ్యాచ్ లన్నీ రాత్రివేళల్లోనే నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







