ఇక ధనాధన్ ‘టి20’ పోరు
- February 04, 2019న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్ లో 4-1తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా ఇక టి20 సిరీస్ విజయంపై కన్నేసింది. టెస్టులు, వన్డేలలో అగ్రశ్రేణి జట్టుగా నిరూపించుకుంటున్న భారత క్రికెట్ జట్టు ట్వంటీ 20 మ్యాచ్ ర్యాంకింగ్ లలో పాకిస్థాన్ కంటే 8 పాయింట్లు వెనుక బడింది. ఆస్ట్రేలియాలో టెస్టులు, వన్డేలలోనూ, న్యూజిలాండ్ లో వన్డే సిరీస్ లోనూ సత్తా చాటి, సంపూర్ణ ఆధిపత్యం వహించిన టీమిండియా టి20 రికార్డులను మెరుగు పరచుకోవడంపై దృష్టి సారించాలని, పాకిస్థాన్ ను అగ్రస్థానం నుంచి తప్పించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన వెల్లింగ్టన్ లో, రెండో టి20 మ్యాచ్ 8వ తేదీన ఆక్లాండ్ లో, మూడో మ్యాచ్ 10వ తేదీన హామిల్టన్ లో జరగనున్నాయి. ఈ మ్యాచ్ లన్నీ రాత్రివేళల్లోనే నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?