ఇక ధనాధన్ ‘టి20’ పోరు

- February 04, 2019 , by Maagulf
ఇక ధనాధన్ ‘టి20’ పోరు

న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్ లో 4-1తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా ఇక టి20 సిరీస్ విజయంపై కన్నేసింది. టెస్టులు, వన్డేలలో అగ్రశ్రేణి జట్టుగా నిరూపించుకుంటున్న భారత క్రికెట్ జట్టు ట్వంటీ 20 మ్యాచ్ ర్యాంకింగ్ లలో పాకిస్థాన్ కంటే 8 పాయింట్లు వెనుక బడింది. ఆస్ట్రేలియాలో టెస్టులు, వన్డేలలోనూ, న్యూజిలాండ్ లో వన్డే సిరీస్ లోనూ సత్తా చాటి, సంపూర్ణ ఆధిపత్యం వహించిన టీమిండియా టి20 రికార్డులను మెరుగు పరచుకోవడంపై దృష్టి సారించాలని, పాకిస్థాన్ ను అగ్రస్థానం నుంచి తప్పించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన వెల్లింగ్టన్ లో, రెండో టి20 మ్యాచ్ 8వ తేదీన ఆక్లాండ్ లో, మూడో మ్యాచ్ 10వ తేదీన హామిల్టన్ లో జరగనున్నాయి. ఈ మ్యాచ్ లన్నీ రాత్రివేళల్లోనే నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com