ఏపీకి రూ 5.56 లక్షల కోట్ల ఇచ్చాం..వైసీపీ అవినీతిలో కూరుకుపోయింది: అమిత్ షా

- February 04, 2019 , by Maagulf
ఏపీకి రూ 5.56 లక్షల కోట్ల ఇచ్చాం..వైసీపీ అవినీతిలో కూరుకుపోయింది: అమిత్ షా

చంద్రబాబు యూటర్న్‌ ముఖ్యమంత్రన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని విజయనగరంలో నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్ర సమావేశంలో అమిత్ షా ఆరోపించారు. ఏపీని మోడీ తప్ప ఎవరూ రక్షించలేరన్నారు. 20 జాతీయ సంస్థలను ఏపీకిచ్చామని.. ఐతే బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని అబద్ధాలు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటివరకు 5.56 లక్షల కోట్ల రూపాయలనుపైగా ఏపీకి ఇచ్చామన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీలు అవినీతిలో కూరుకుపోయాయని… రాయలసీమలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని అమిత్‌ షా మండిపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com