యూఏఈ రెసిడెంట్స్‌కి వెదర్‌ వార్నింగ్‌

- February 04, 2019 , by Maagulf
యూఏఈ రెసిడెంట్స్‌కి వెదర్‌ వార్నింగ్‌

యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, రెసిడెంట్స్‌ కోసం ముఖ్యమైన వెదర్‌ అడ్వయిజరీని జారీ చేసింది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలని సోషల్‌ మీడియా ద్వారా పేర్కొంది. ఈ క్రమంలో కొన్ని హెచ్చరికల్ని కూడా మినిస్ట్రీ జారీ చేయడం జరిగింది. వ్యాలీ స్ట్రీమ్స్‌ని క్రాస్‌ చేయడం, కూర్చోవడం ద్వారా ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దనేది ఆ హెచ్చరికల్లో మొదటిది. వాలీ స్ట్రీమ్స్‌కి దూరంగా వుండాలి, ఎందుకంటే అవి వున్నపళంగా కుప్పకూలిపోవచ్చు. వాలీ స్ట్రీమ్స్‌ మీద వెళుతున్నప్పుడు వేగంగా దూసుకొచ్చే నీటి కారణంగా మీ వాహనం కొట్టుకుపోయే ప్రమాదం వుంటుంది. రోడ్లు, బ్రిడ్జిలపై నీరు ఓవర్‌ ఫ్లో అయ్యే అవకాశాలుంటాయి. నీటి మడుగులకు దగ్గరలో పిల్లల్ని వుండనీయొద్దు. స్లోపింగ్‌ రోడ్స్‌ వర్షపు నీటితో నిండిపోతాయి. వ్యాలీ స్ట్రీమ్స్‌లోకి చూడటం వల్ల డ్రౌజీగా ఫీలయి, అందులో పడిపోయే ప్రమాదం వుంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com