రికార్డు సృష్టించిన కుంభమేళా
- February 05, 2019
యూపీ: ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. కుంభమేళా భక్తజనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిచ్చారు. దీంతో కుంభమేళాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఒక్క రోజే 5కోట్ల మంది సాహ్నీ స్నానాలు ఆచరించారు. 2019, ఫిబ్రవరి 4వ తేదీ సోమవారం ఈ రికార్డ్ క్రియేట్ అయ్యింది. సోమవారం మౌని అమావాస్య. దీంతో ఒక్క రోజే 5 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. మౌని అమావాస్యను కుంభమేళాలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కుంభమేళా సందర్భంగా ముక్కోటి దేవతలు త్రివేణి సంగమంలో కొలువుదీరుతారని, వారిని స్మరిస్తూ పుణ్యస్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే దేశవిదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు కుంభమేళాకు హాజరవుతున్నారు. నాగా సాధువులుగా మారాలనుకునే వారు మౌని అమావాస్య రోజునే దీక్ష తీసుకున్నారు. మౌని అమావాస్య రోజున గంగా నదిలో నీళ్లు అమృతంగా మారుతాయని శాస్త్రోక్తి. అందుకే ఈ రోజున గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
కుంభమేళాలో మూడు సాహ్నీ స్నానాలు ఉంటాయి. తొలి స్నానం కుంభమేళా ప్రారంభమైన మకర సంక్రాంతి రోజు, రెండో మౌని అమావాస్య రోజు, మూడోది వసంత పంచమి (ఫిబ్రవరి 10)న ఉంటాయి. ప్రయాగ్ రాజ్లో భక్తుల రాక అంతకంతకూ పెరుగుతోంది. మాఘ మాసం ప్రారంభం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. జైన తీర్థంకరుల్లో మొదటివాడైన రిషభదేవుడు మౌని అమావాస్య రోజున తన మౌన వ్రతాన్ని విరమించి, పుణ్య నదుల్లో స్నానం చేశాడని జైనులు నమ్ముతారు. దీంతో జైనులు కూడా మౌని అమావాస్య రోజున భారీగా తరలివచ్చి స్నానాలు చేశారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







