"వారి గౌరవానికి భంగం కలిగించొద్దు" అంటున్న `యాత్ర` దర్శకుడు
- February 06, 2019
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన చిత్రం `యాత్ర`. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 8) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులను, ప్రేక్షకులను ఉద్దేశిస్తూ దర్శకుడు మహి ఓ లేఖను విడుదల చేశారు. ఎన్టీయార్, వైఎస్సార్ ఈ మట్టి వారసులని, మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించకూడదని ఆ లేఖలో పేర్కొన్నారు.
`గొప్ప నాయకుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవితాన్ని తెరకెక్కించే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. వైఎస్సార్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా టీమంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాను మరో సినిమాతో పోల్చి రేసులో నిలబెట్టకండి. ఓ గొప్ప నాయకుడి ప్రయాణాన్ని సంతోషంగా ఆస్వాదిద్దాం. ఎన్టీయార్గారూ, వైఎస్సార్గారూ తెలుగు జాతి గర్వించదగిన గొప్ప దిగ్గజాలు. ఎంతో కీర్తిని వదలి వెళ్లిన ఈ మట్టి వారసులు.
మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించొద్దు. వైఎస్ఆర్, చిరంజీవి గారిపట్ల నాకు చాలా ప్రేమ ఉంది. అంతమాత్రాన ఇతరుల మీద ద్వేషం కలగలేదు. మా `యాత్ర`ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన`ని మహి ఆ లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







