"వారి గౌరవానికి భంగం కలిగించొద్దు" అంటున్న `యాత్ర` దర్శకుడు
- February 06, 2019
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన చిత్రం `యాత్ర`. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 8) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులను, ప్రేక్షకులను ఉద్దేశిస్తూ దర్శకుడు మహి ఓ లేఖను విడుదల చేశారు. ఎన్టీయార్, వైఎస్సార్ ఈ మట్టి వారసులని, మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించకూడదని ఆ లేఖలో పేర్కొన్నారు.
`గొప్ప నాయకుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవితాన్ని తెరకెక్కించే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. వైఎస్సార్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా టీమంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాను మరో సినిమాతో పోల్చి రేసులో నిలబెట్టకండి. ఓ గొప్ప నాయకుడి ప్రయాణాన్ని సంతోషంగా ఆస్వాదిద్దాం. ఎన్టీయార్గారూ, వైఎస్సార్గారూ తెలుగు జాతి గర్వించదగిన గొప్ప దిగ్గజాలు. ఎంతో కీర్తిని వదలి వెళ్లిన ఈ మట్టి వారసులు.
మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించొద్దు. వైఎస్ఆర్, చిరంజీవి గారిపట్ల నాకు చాలా ప్రేమ ఉంది. అంతమాత్రాన ఇతరుల మీద ద్వేషం కలగలేదు. మా `యాత్ర`ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన`ని మహి ఆ లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!