"వారి గౌరవానికి భంగం కలిగించొద్దు" అంటున్న `యాత్ర` దర్శకుడు

- February 06, 2019 , by Maagulf

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన చిత్రం `యాత్ర`. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 8) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులను, ప్రేక్షకులను ఉద్దేశిస్తూ దర్శకుడు మహి ఓ లేఖను విడుదల చేశారు. ఎన్టీయార్‌, వైఎస్సార్ ఈ మట్టి వారసులని, మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించకూడదని ఆ లేఖలో పేర్కొన్నారు.

`గొప్ప నాయకుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవితాన్ని తెరకెక్కించే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. వైఎస్సార్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా టీమంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాను మరో సినిమాతో పోల్చి రేసులో నిలబెట్టకండి. ఓ గొప్ప నాయకుడి ప్రయాణాన్ని సంతోషంగా ఆస్వాదిద్దాం. ఎన్టీయార్‌గారూ, వైఎస్సార్‌గారూ తెలుగు జాతి గర్వించదగిన గొప్ప దిగ్గజాలు. ఎంతో కీర్తిని వదలి వెళ్లిన ఈ మట్టి వారసులు.

మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించొద్దు. వైఎస్‌ఆర్‌, చిరంజీవి గారిపట్ల నాకు చాలా ప్రేమ ఉంది. అంతమాత్రాన ఇతరుల మీద ద్వేషం కలగలేదు. మా `యాత్ర`ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన`ని మహి ఆ లేఖలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com