జపాన్ విలేజ్ ప్రారంభం
- February 09, 2019
బహ్రెయిన్:సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, జపాన్ విలేజ్ని ప్రారంభించారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఈ తొలి జపనీస్ ఎక్స్పో ప్రారంభమయ్యింది. జదరన్ గవర్నరేట్ ఈ ఈవెంట్ని బహ్రెయినీ జపనీస్ ఫ్రెండ్షిప్ సొసైటీ అలాగే బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్తో కలిసి ఏర్పాటు చేసింది. లేబర్ ఫండ్ (తమ్కీన్) సహాయ సహకారాలు అందించింది. బహ్రెయిన్ అలాగే పలు ఇతర దేశాల నుంచి 28 పార్టీస్ మూడు రోజుల ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. ఈ ఎక్స్పోని ప్రారంభించడం చాలా ఆనందంగా వుందని షేక్ ఖలీఫా చెప్పారు. బహ్రెయిన్, జపాన్ మధ్య స్నేహపూర్వక వాతావరణం వుందనీ, బహ్రెయిన్లో జపనీయులు సంతోషంగా వున్నారనీ వివరించారాయన. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు షేక్ ఖలీఫా.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







