భవనంపైనుంచి పడి భారతీయ వలసదారుడి మృతి
- February 09, 2019
షార్జా:32 ఏళ్ళ ఇండియన్ వలసదారుడు గోప కుమార్, ఓ భవనంలోని ఏడవ అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని అల్ మజారా ప్రాంతంలోగల ఖాన్ సాహెబ్ బిల్డింగ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోప కుమార్ కేరళకు చెందిన వ్యక్తి. మెయిన్టెనెన్స్ వర్కర్గా పనిచేస్తున్న గోపకుమార్, వాచ్మెన్తో కలిసి రూమ్ షేర్ చేసుకుంటున్నారు. పైనుంచి కింద పడిన వెంటనే గోపకుమార్ ప్రాణాలు కోల్పోయాడని హుటాహటిన అక్కడికి చేరుకున్న అధికారులు పేర్కొన్నారు. విచారణ పూర్తి కాకుండానే అతనిది ఆత్మహత్య అని చెప్పలేమని అధికారులు అంటున్నారు. వాచ్మెన్ని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. గోపకుమార్ స్నేహితుడు మాట్లాడుతూ, తమ స్నేహితుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







