భవనంపైనుంచి పడి భారతీయ వలసదారుడి మృతి
- February 09, 2019
షార్జా:32 ఏళ్ళ ఇండియన్ వలసదారుడు గోప కుమార్, ఓ భవనంలోని ఏడవ అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని అల్ మజారా ప్రాంతంలోగల ఖాన్ సాహెబ్ బిల్డింగ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోప కుమార్ కేరళకు చెందిన వ్యక్తి. మెయిన్టెనెన్స్ వర్కర్గా పనిచేస్తున్న గోపకుమార్, వాచ్మెన్తో కలిసి రూమ్ షేర్ చేసుకుంటున్నారు. పైనుంచి కింద పడిన వెంటనే గోపకుమార్ ప్రాణాలు కోల్పోయాడని హుటాహటిన అక్కడికి చేరుకున్న అధికారులు పేర్కొన్నారు. విచారణ పూర్తి కాకుండానే అతనిది ఆత్మహత్య అని చెప్పలేమని అధికారులు అంటున్నారు. వాచ్మెన్ని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. గోపకుమార్ స్నేహితుడు మాట్లాడుతూ, తమ స్నేహితుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







