భవనంపైనుంచి పడి భారతీయ వలసదారుడి మృతి

- February 09, 2019 , by Maagulf
భవనంపైనుంచి పడి భారతీయ వలసదారుడి మృతి

షార్జా:32 ఏళ్ళ ఇండియన్‌ వలసదారుడు గోప కుమార్‌, ఓ భవనంలోని ఏడవ అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని అల్‌ మజారా ప్రాంతంలోగల ఖాన్‌ సాహెబ్‌ బిల్డింగ్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోప కుమార్‌ కేరళకు చెందిన వ్యక్తి. మెయిన్‌టెనెన్స్‌ వర్కర్‌గా పనిచేస్తున్న గోపకుమార్‌, వాచ్‌మెన్‌తో కలిసి రూమ్‌ షేర్‌ చేసుకుంటున్నారు. పైనుంచి కింద పడిన వెంటనే గోపకుమార్‌ ప్రాణాలు కోల్పోయాడని హుటాహటిన అక్కడికి చేరుకున్న అధికారులు పేర్కొన్నారు. విచారణ పూర్తి కాకుండానే అతనిది ఆత్మహత్య అని చెప్పలేమని అధికారులు అంటున్నారు. వాచ్‌మెన్‌ని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. గోపకుమార్‌ స్నేహితుడు మాట్లాడుతూ, తమ స్నేహితుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com