భారత్లో ఉగ్రదాడి, ఖండించిన యూఏఈ
- February 15, 2019
భారతదేశంలో జరిగిన ఉగ్రదాడిని యూఏఈ ఖండించింది. జమ్మూకాశ్మీర్లో తీవ్రవాదులు, నిన్న జరిపిన మారణహోమంలో 39 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, ఓ ప్రకటన ద్వారా ఈ ఘటనను ఖండించడం జరిగింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించాలనీ, ఆధునిక సమాజంలో హింసకు తావులేదని యూఏఈ ఆ ప్రకటనలో పేర్కొంది. మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు యూఏఈ మినిస్ట్రీ విడుదల చేసిన సంతాప ప్రకటనలో ప్రస్తావించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







