భారత్లో ఉగ్రదాడి, ఖండించిన యూఏఈ
- February 15, 2019
భారతదేశంలో జరిగిన ఉగ్రదాడిని యూఏఈ ఖండించింది. జమ్మూకాశ్మీర్లో తీవ్రవాదులు, నిన్న జరిపిన మారణహోమంలో 39 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, ఓ ప్రకటన ద్వారా ఈ ఘటనను ఖండించడం జరిగింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించాలనీ, ఆధునిక సమాజంలో హింసకు తావులేదని యూఏఈ ఆ ప్రకటనలో పేర్కొంది. మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు యూఏఈ మినిస్ట్రీ విడుదల చేసిన సంతాప ప్రకటనలో ప్రస్తావించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







