కాశ్మీర్లో తీవ్రవాద దాడిని ఖండించిన ఒమన్
- February 16, 2019
మస్కట్: జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన తీవ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించింది ఒమన్. ఈ ఘటనలో భారత పారామిలిటరీ ఫోర్స్కి చెందిన 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఒమన్, సంతాప ప్రకటనలో పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. భారతదేశంలో ఈ దాడి జరగడం తమకు బాధ కలిగించిందనీ, ఉగ్రవాదాన్ని తరిమికొట్టే క్రమంలో భారత్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి ఒమన్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని ఒమన్ పేర్కొంది. ఈ ఘటనలో క్షతగాత్రులైనవారు త్వరగా కోలుకోవాలని ఒమన్ ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







