రియాద్‌ ఎయిర్‌పోర్ట్‌ని సందర్శించిన 26 మిలియన్‌ ప్రయాణీకులు

- February 20, 2019 , by Maagulf
రియాద్‌ ఎయిర్‌పోర్ట్‌ని సందర్శించిన 26 మిలియన్‌ ప్రయాణీకులు

జెడ్డా:రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 26 మిలియన్‌ ప్రయాణీకులు 2018లో ప్రయాణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2017తో పోల్చితే గ్రోత్‌ రేట్‌ 5.33 శాతంగా నమోదయ్యింది. ఇంటర్నల్‌ విమానాల్లో ప్రయాణించినవారి సంఖ్యలో గ్రోత్‌ రేట్‌ 8.39గా నమోదయ్యింది. అంతర్జాతీయ విమానాలకు సంబంధించి ఈ గ్రోత్‌ రేట్‌ 2.21 శాతంగా వుంది. 2018లో రీచ్‌ అయిన విమానాల సంఖ్య 212,632 - గ్రోత్‌ రేట్‌ 1.46 శాతం. ఇంటర్నేషనల్‌ విమానాల రేట్‌ 3.43 శాతం పెరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com