ట్వీట్ చేస్తే రూ.5 లక్షల బహుమానం
- February 21, 2019
టెక్నాలజీ ఎన్నో అవకాశాలను తెచ్చిపెడుతోంది. క్రియేటివ్గా ఆలోచించే వారికి ఓ అవకాశం అంటూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్లో మీరూ పాల్గొనే అవకాశం ఉంది. గెలిస్తే అదృష్టం అయిదు లక్షల రూపంలో మిమ్మల్ని వరిస్తుంది.
దీనికి మీరు చేయవలసిందల్లా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా మాత్రమే కాకుండా కాస్త క్రియేటివ్గా ట్వీట్ చేయాలి. ఇది ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. మీ మెసేజ్ని #StopThinkAct అనే హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
బ్యాంకు మోసాలు, బ్యాంకింగ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్లు, ఆన్లైన్ మోసాలపై మీ మెసేజ్ ఉండాలి. అయితే ఇది టెక్ట్స్ మెసేజ్ మాత్రమే కానక్కరలేదు, ఫొటోలు, వీడియోలు, ఏవైనా పంపించొచ్చు. కానీ క్రియేటివ్గా ఉండాలనే విషయం మాత్రం మర్చిపోకూడదు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







