ట్వీట్ చేస్తే రూ.5 లక్షల బహుమానం
- February 21, 2019
టెక్నాలజీ ఎన్నో అవకాశాలను తెచ్చిపెడుతోంది. క్రియేటివ్గా ఆలోచించే వారికి ఓ అవకాశం అంటూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్లో మీరూ పాల్గొనే అవకాశం ఉంది. గెలిస్తే అదృష్టం అయిదు లక్షల రూపంలో మిమ్మల్ని వరిస్తుంది.
దీనికి మీరు చేయవలసిందల్లా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా మాత్రమే కాకుండా కాస్త క్రియేటివ్గా ట్వీట్ చేయాలి. ఇది ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. మీ మెసేజ్ని #StopThinkAct అనే హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
బ్యాంకు మోసాలు, బ్యాంకింగ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్లు, ఆన్లైన్ మోసాలపై మీ మెసేజ్ ఉండాలి. అయితే ఇది టెక్ట్స్ మెసేజ్ మాత్రమే కానక్కరలేదు, ఫొటోలు, వీడియోలు, ఏవైనా పంపించొచ్చు. కానీ క్రియేటివ్గా ఉండాలనే విషయం మాత్రం మర్చిపోకూడదు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









