సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..
- February 22, 2019
బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. వర్ధమాన నటి సంఘమిత్ర రాయ్ ఛటర్జీ మృతి చెందారు. వెండితెరపై అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. నటిగా ఎదుగుతున్న ఈ యంగ్ హీరోయిన్ గత కొన్ని రోజులుగా బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా క్యారాబెల్ అటాక్ రావడంతో ఆమె మృత్యువాత పడింది. రెండేళ్ల పాటు మృత్యువుతో పోరాడిన సంఘమిత్ర.. అలసిపోయి మరణం ముందు ఓడిపోయి.. చివరకు గురువారం నాడు మృత్యువు ఒడిలోకి చేరింది.
‘దామిని’, గహీన్ హృదయ్’ , దేక్ కమాన్ లగే’, మూవీలో నటించింది సంఘమిత్ర. నటిగా, మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె నిర్మాతగానూ తనను తాను నిరూపించుకోవాలని ఆశపడింది. ఇందులో భాగంగానే నిర్మాత ప్రదీప్ చురీవాల్తో కలిసి ఓ సినిమా నిర్మించేందుకు కూడా రెడీ అయింది. సంఘమిత్రకు ఆరేళ్ల కూతురు ఉంది. అయితే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని.. వెండితెరపై రాణించేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ









