సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..
- February 22, 2019బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. వర్ధమాన నటి సంఘమిత్ర రాయ్ ఛటర్జీ మృతి చెందారు. వెండితెరపై అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. నటిగా ఎదుగుతున్న ఈ యంగ్ హీరోయిన్ గత కొన్ని రోజులుగా బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా క్యారాబెల్ అటాక్ రావడంతో ఆమె మృత్యువాత పడింది. రెండేళ్ల పాటు మృత్యువుతో పోరాడిన సంఘమిత్ర.. అలసిపోయి మరణం ముందు ఓడిపోయి.. చివరకు గురువారం నాడు మృత్యువు ఒడిలోకి చేరింది.
‘దామిని’, గహీన్ హృదయ్’ , దేక్ కమాన్ లగే’, మూవీలో నటించింది సంఘమిత్ర. నటిగా, మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె నిర్మాతగానూ తనను తాను నిరూపించుకోవాలని ఆశపడింది. ఇందులో భాగంగానే నిర్మాత ప్రదీప్ చురీవాల్తో కలిసి ఓ సినిమా నిర్మించేందుకు కూడా రెడీ అయింది. సంఘమిత్రకు ఆరేళ్ల కూతురు ఉంది. అయితే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని.. వెండితెరపై రాణించేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!