సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..
- February 22, 2019
బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. వర్ధమాన నటి సంఘమిత్ర రాయ్ ఛటర్జీ మృతి చెందారు. వెండితెరపై అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. నటిగా ఎదుగుతున్న ఈ యంగ్ హీరోయిన్ గత కొన్ని రోజులుగా బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా క్యారాబెల్ అటాక్ రావడంతో ఆమె మృత్యువాత పడింది. రెండేళ్ల పాటు మృత్యువుతో పోరాడిన సంఘమిత్ర.. అలసిపోయి మరణం ముందు ఓడిపోయి.. చివరకు గురువారం నాడు మృత్యువు ఒడిలోకి చేరింది.
‘దామిని’, గహీన్ హృదయ్’ , దేక్ కమాన్ లగే’, మూవీలో నటించింది సంఘమిత్ర. నటిగా, మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె నిర్మాతగానూ తనను తాను నిరూపించుకోవాలని ఆశపడింది. ఇందులో భాగంగానే నిర్మాత ప్రదీప్ చురీవాల్తో కలిసి ఓ సినిమా నిర్మించేందుకు కూడా రెడీ అయింది. సంఘమిత్రకు ఆరేళ్ల కూతురు ఉంది. అయితే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని.. వెండితెరపై రాణించేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







