కుప్పకూలిన క్రేన్: కార్మికుడి మృతి
- February 25, 2019
ఆసియాకి చెందిన కార్మికుడొకరు అబుదాబీలోని అల్ రహా బీచ్ వద్ద కన్స్ట్రక్షన్ సైట్లో ఓ క్రేన్ కుప్పకూలడంతో మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి పెట్రోల్స్, అంబులెన్స్ చేరుకున్నాయనీ, తక్షణ సహాయ చర్యల అనంతరం గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని అధికారులు పేర్కొన్నారు. అల్ ముఫ్రాక్ మరియు అల్ రహ్బా హాస్పిటల్స్కి గాయపడ్డవారిని తరలించారు. ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ డిపార్ట్మెంట్ - డైరెక్టరేట్ ఆఫ్ ఎమర్జన్సీ అండ్ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీమ్ అలి జలాల్ బలౌషి మాట్లాడుతూ, నిర్మాణ సంస్థలు తగినన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రేన్లను రెగ్యులర్గా మెయిన్టెనెన్స్ చేయడం ద్వారా ప్రమాదాల్ని నియంత్రించవచ్చునని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







