తీవ్రవాదాన్ని తిరస్కరించిన భారత ముస్లింలు: సుష్మా స్వరాజ్
- March 01, 2019
విషం చిమ్మే తీవ్రవాదాన్ని భారత ముస్లింలు సహించబోరని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. అబుదాబీలో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మీటింగ్లో పాల్గొన్న సుష్మా స్వరాజ్ భారత స్వరాన్ని బలంగా విన్పించారు. ఎన్నో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా శాంతినే నమ్ముతోన్న దేశం తరఫున తాను ఈ సమావేశంలో ప్రాతినిత్యం వహిస్తున్నాననీ, ఇది తనకు గర్వంగా వుందని అన్నారామె. ఎన్నో మతాలు, ఎన్నో ప్రాంతాలున్నా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని ఆమె అన్నారు. 1.3 బిలియన్ ఇండియన్స్ అందులో 185 మంది ముస్లిం సోదరులు, సోదరీమణుల శుభాకాంక్షల్ని తాను తీసుకొచ్చినట్లు సుష్మ పేర్కొనడం గమనార్హం. భారతదేశంలో ముస్లింలు కూడా భాగమనీ, ఆయా రాష్ట్రాల్లో ఆయా భాషల్ని ముస్లింలు అనుసరిస్తున్నారని, వారంతా భారతదేశంలో క్షేమంగా వున్నారనీ, వుంటారని సుష్మా స్వరాజ్ అన్నారు. తీవ్రవాదాన్ని ఎవరూ ఉపేక్షించరాదనీ, ప్రపంచానికి తీవ్రవాదం పెనుముప్పుగా మారిందని చెప్పారామె.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







