పాకిస్తాన్ ప్రధానితో సౌదీ మంత్రి భేటీ
- March 08, 2019
ఇస్లామాబాద్:భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. సౌదీ అరేబియాకు చెందిన అత్యున్నత రాయబారి ఒకరు పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్తో గురువారం భేటీ అయ్యారని, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పంపిన ప్రత్యేక సందేశాన్ని ప్రధానికి చేరవేశారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ మేరకు సౌదీ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అడెల్ అల్ జుబేర్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్తో ఆయన నివాసంలో సమావేశమైనట్లు జియో టీవీ వెల్లడించింది. ఇరువురి మధ్య.. ప్రస్తుతం భారత్-పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చాయని వివరించింది. ఈ సందర్భంగా యువరాజు పంపిన ప్రత్యేక సందేశాన్ని జుబేర్ ప్రధానికి చేరవేశారని పేర్కొంది. ఈ సమావేశంలో పాకిస్థాన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ, ప్రధానమంత్రి వాణిజ్య సలహాదారు, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు సమాచారం. భారత్తో ఉద్రిక్తతలను శాంతియుత మార్గంలో తగ్గించేందుకు తమ దేశం సహకరిస్తుందని జుబేర్ ఈ సందర్భంగా ఖురేషీకి హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







