వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్
- March 20, 2019
భారత్లో బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. భారత ప్రభుత్వం వినతి మేరకు లండన్ పోలీసులు, నీరవ్ మోదీని అరెస్టు చేశారు. కాసేపట్లో అతన్ని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. చట్టపరమైన ప్రక్రియ తర్వాత నీరవ్ను మనదేశానికి అప్పగించే పని మొదలు కానుంది.
నీరవ్ మోదీ, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సుమారు 13 వేల కోట్లు ఎగ్గొట్టి బ్రిటన్కు పారిపోయారు. అతను లండన్లో ఎక్కడ ఉంటున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తు న్నాడో టెలిగ్రాఫ్ పత్రిక బయటపెట్టింది. అప్పటికే అతన్ని మళ్లీ భారత్కు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న సీబీఐ, ఈడీలు… టెలిగ్రాఫ్ కథనంతో అలర్ట య్యాయి. నీరవ్ను వెంటనే అరెస్టు చేయాలంటూ ఈనెల 9వ తేదీన లండన్లోని హోం శాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబం ధించి నీరవ్ను తమకు అప్పగించాలని లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్పందించిన కోర్టు, నీరవ్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







