టెర్రాస్‌పై నివసిస్తున్న ఆసియా వ్యక్తి

- April 19, 2019 , by Maagulf
టెర్రాస్‌పై నివసిస్తున్న ఆసియా వ్యక్తి

మనామా:భారతీయ వలసదారుడొకరు మనామాలోని ఓ రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌ టెర్రాస్‌పై నివసిస్తున్నట్లు గుర్తించారు. కేరళ నుంచి వచ్చిన సులేమాన్‌, బహ్రెయిన్‌లో 10 ఏళ్ళుగా వుంటున్నారు. తన స్పాన్సరర్‌ మృతితో పాస్‌పోర్ట్‌ని పోగొట్టుకున్న సులేమాన్‌, వీసా రెన్యువల్‌ చేసుకోలేని పరిస్థితుల్లో వున్నారు. కొన్ని రోజులపాటు ఫుట్‌పాత్‌పై నివసించిన సులేమాన్‌, ఎవరో ఒకరు పని ఇస్తారనే నమ్మకంతో వున్నారు. వృద్ధాప్యంతో ఆకలి బాధలతో జీవితం వెల్లదీస్తున్నారాయన. సులేమాన్‌ కుమారుడు తన తండ్రి దయనీయ స్థితిని తెలుసుకుని కుమిలిపోతున్నాడు. తన తండ్రి స్వదేశానికి వచ్చేందుకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com