శ్రీలంక పేలుళ్ళ కేసు : ఏడుగురు అనుమానితుల అరెస్ట్
- April 21, 2019
కొలంబో:వందల మంది జీవితాలను అగాధంలోకి నెట్టిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ఏడుగురు అనుమానితులను శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం నుంచి జరిగిన 8 వరుస బాంబు పేలుళ్ళలో 190 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 27 మంది విదేశీయులు, 350 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.
ఎనిమిదో పేలుడు కొలంబో శివారులోని దెమటగోడలో సంభవించింది. ఈ ప్రాంతంలో అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఈ అనుమానితులు ఓ ఇంట్లో ఉండగా పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఆదివారం ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 8 పేలుళ్ళు సంభవించినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్ళు, ఓ గెస్ట్ హౌస్ లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలిపింది. ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!