దుబాయ్ హోటల్లో అగ్ని ప్రమాదం: ముగ్గురికి అస్వస్థత
- May 06, 2019
దుబాయ్లోని షేక్ జాయెద్ రోడ్డులోగల ఓ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ పోలీస్ ఓ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, అక్కడికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ టీమ్ మంటల్ని సకాలంలో అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. హోటల్లోని సౌనా రూమ్లో ఈ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. సంఘటన జరిగిన వెంటనే హోటల్ని ఖాళీ చేయించారు. స్వల్ప అగ్ని ప్రమాదం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పొగ పీల్చడం వల్ల ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!