మహిళా పోలీస్పై ఇద్దరు యువతుల దాడి
- May 13, 2019కువైట్: పెట్రోలింగ్లో వున్న ఓ మహిళా పోలీస్ అధికారిపై ఇద్దరు యువతులు దాడి చేశారు. ఈ క్రమంలో నిందితులు, ఆ పోలీస్ అధికారి బట్టల్ని సైతం చించేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే ఘటన జరిగిన సమయంలో నిందితులు అసాధారణ పరిస్థితుల్లో వున్నారని అధికారులు అంటున్నారు. పబ్లిక్ ఆఫీసర్ని అవమానించడం, దాడి చేయడం, వాహనాన్ని అసాధారణ స్థితిలో నడపడం, పోలీస్ అధికారిణి బట్టలు చించి వేయడం వంటి వకేసుల్ని నిందితులపై నమోదు చేశారు పోలీసులు. నిందితులపై కఠిన చర్యలుంటాయనీ, మహిళా అధికారిణిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇంటీరియర్ మినిస్ట్రీ ఆపరేషన్స్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ జమాల్ అల్ సయెగ్ చెప్పారు. చెక్ పాయింట్ వద్ద వాహనాల్ని మహిళా పోలీస్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే, నిందితులు తాము ఎలాంటి దుశ్చర్యకూ పాల్పడలేదని బుకాయిస్తున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..