కమల్ హాసన్పై కేసు నమోదు
- May 15, 2019స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది గాడ్సే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్పై కేసు నమోదైంది. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కమల్పై అరవక్కురిచ్చి పోలీస్ స్టేషన్లో కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్ హాసన్పై 153-ఏ, 295-ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
అరువక్కురిచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్…స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరామ్ గాడ్సే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మగాంధీని హత్యచేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ఆరంభమైందని వివాదాస్పద కామెంట్స్ చేశారు కమల్. ఇక్కడ ముస్లీం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని తాను చెప్పడం లేదని..ఎక్కడైనా ఇదే మాట చెబుతానని అన్నారు. కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలు దెబ్బతిసిన కమల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ